calender_icon.png 8 September, 2024 | 8:34 AM

కించపరిచే ఉద్దేశంతో చేయలేదు

27-07-2024 12:33:21 AM

రామ్ జగన్నాథ్ కాంబోలో తెరకెక్కు తున్న తాజా చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. కావ్య థాపర్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ‘మార్ ముంతా.. ఛోడ్ చింతా...’ పాటను మేకర్స్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఒక సందర్భంలో కేసీఆర్ చెప్పి న ‘ఏంజేద్దమంటవ్ మరి..’ అనే మాటను ఈ పాట లిరిక్స్ మధ్యలో మూవీ మేకర్స్ వినియోగించారు. ఈ పాటకు సంగీత ప్రియుల నుంచి మంచి స్పందన వస్తుండటంతో గీత రచయిత కాసర్ల శ్యామ్, స్వరకర్త మణిశర్మ, గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ తాజాగా ఈ పాట విశేషాలను పరస్పరం పంచుకున్నారు. ఈ చర్చలో మణిశర్మ మాట్లాడుతూ.. “చాలా మంది ఐటెం సాంగ్ అనుకున్నారు. కానీ, ఇది డ్యూయెట్. సోషల్ మీడియా మీమ్స్ ఆధారంగా దీని లిరిక్స్ రాశాం.

కేసీఆర్ గారంటే అందరికీ గౌరవం ఉంది. ఆయన సరదాగా పలికిన ఓ మాటను ఇందులో తీసుకున్నామంతే.. తద్వారా ఆయన్ను ఓసారి ఈ పాటలో తలుచుకున్నాం. దయచేసి అందరూ అలానే భావించండి. ఇది కేవలం వినోదం కోసం చేసిందే” అని వివరించారు. ఇలా సంగీత బృందం విమర్శలకు తెర దించే ప్రయత్నం చేయగా, ‘క్యా లప్డా..’ అనే మరో పాట ఈనెల 29న విడుదల కానుంది. మూవీకి చెందిన థర్డ్ సింగిల్‌గా దీన్ని రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ వెల్లడించారు.