హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 25(విజయక్రాంతి): హైడ్రాది కాదు మీదే డ్రామా అని జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్ద్దీన్ బీఆర్ఎస్ నేతలను విమర్శించారు. బుధవారం హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశం లో ఆయన మాట్లాడుతూ.. ఇంకా తానే మున్సిపల్ మంత్రిని అని కేటీఆర్ ఫీల్ అవుతున్నారని ఎద్దేవా చేశారు. పదేళ్ల్ల బీఆర్ఎస్ పాలనలో అన్నీ అక్రమాలేనని విమర్శించారు. అక్రమ కట్టడాల కూల్చివేతలపై హైడ్రా అధికారులు డ్రామా చేస్తున్నారంటూ కేటీఆర్ శ్రీరంగనీతులు చెబుతున్నారని విమర్శించారు.