భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 28(విజయక్రాంతి): విద్యాబోధన చేయాల్సిన సమయంలో సెల్ఫోన్లో వీడియో చూసిన ఉపాధ్యా యుడ్ని సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాధికారి శనివారం ఉత్తర్వులు జారీ చే శారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం శ్రీ రంగాపు రం మండల పరిషత్ ప్రాథమిక పా ఠశాలలో బి చందులాల్ టీచర్గా పనిచేస్తున్నారు.
పాఠశాల సమయ ంలో విద్యాభోదన చేయకుండా తీరి గ్గా సెల్ఫోన్లో వీడియో చూస్తున్న ట్టు ఈ నెల 21న వార్తా పత్రికల్లో క థనాలు వచ్చాయి. ఎంఈవో విచారణలో నిజమేనని తేలడంతో కలెక్ట ర్ జితేష్ వి పాటిల్ ఆదేశాల మేరకు చందులాల్ను సస్పెండ్ చేస్తూ డీఈవో వెంకటేశ్వరచారి ఉత్తర్వులు జారీ చేశారు.