calender_icon.png 23 October, 2024 | 11:18 PM

‘పిండం’ నిర్మాతకు సైమాలో నామినేషన్

21-07-2024 12:17:25 AM

శ్రీరామ్, ఖుషి రవి జంటగా నటించిన హారర్ థ్రిల్లర్ చిత్రం ‘పిండం’. దర్శకుడు సాయికిరణ్ దైదాతోపాటు ఈ చిత్రం ద్వారానే కళాహి మీడియా వ్యవస్థాపకుడు యశ్వంత్ దగ్గుమాటి నిర్మాతగా సినీ రంగ ప్రవేశం చేశా రు. విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతోపాటు, వాణిజ్యపరంగా విజయం సాధించిన ‘పిండం’ చిత్రం అవార్డు వేడుకల్లో సత్తా చాటుతోంది. తాజాగా ‘సైమా 2024’లో ఉత్తమ తొలి చిత్ర నిర్మాత విభాగంలో నామినేషన్ పొందిందీ మూవీ. కమర్షియల్ చట్రానికి దూరంగా, మొదటి సినిమాతోనే ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించాలనే తపనతో ఈ వైవిధ్యమైన చిత్రంతో నిర్మాతగా పరిచయమయ్యారు యశ్వంత్. సినిమా పట్ల ఆయనకున్న ఈ తపనే ఈ నామినేషన్ పొందేలా చేసిందనేది సినీ వర్గాల మాట. ఈ అవార్డును గెలుచుకుంటామని చిత్రబృందం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. అయితే, యశ్వంత్.. దర్శకుడు సాయికిరణ్‌తో మరో కొత్త సినిమా కోసం చేతులు కలుపుతున్నట్టు కళాహి మీడియా ప్రకటించింది. ఇప్పటికే కథ సిద్ధంగా ఉన్న ఈ చిత్రాన్ని 2024 చివరి నాటికి సెట్స్‌పైకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు.