20-03-2025 12:02:54 AM
త్రినాథరావు నక్కిన తన అప్ కమింగ్ క్రైమ్ -కామెడీ డ్రామా ‘చౌర్య పాఠం’తో మూవీ ప్రొడక్షన్లోకి అడుగుపెడుతున్నారు. ఈ చిత్రంతో ఇంద్రా రామ్ హీరోగా పరిచయం అవుతున్నారు. నిఖిల్ గొల్లమారి ఈ మూవీతో దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం టీజర్ థ్రిల్లింగ్ క్రైమ్, డార్క్ హ్యూమర్ బ్లెండ్తో ఇప్పటికే బజ్ క్రియేట్ చేసింది.
నాగ చైతన్య లాంచ్ చేసిన ప్రమోషనల్ సాంగ్కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ టెర్రిఫయింగ్ నంబర్ ‘ఆడ పిశాచం’ పాటను విడుదల చేశారు. ‘గూడు పుఠాణం.. చావు ప్రయాణం ద్బ్బు పోయెను జీవితం. ఆడపిశాచం లేదు ప్రశాంతం.. మట్టుపోయెను జాతకం’ అంటూ సాగే భాస్కరభట్ల రవికుమార్ రాసిన లిరిక్స్ మంచి ఫన్తో ఆకట్టుకుంటున్నాయి.
దావ్జాండ్ ఈ పాటను ఎనర్జిటిక్ వైబ్ అండ్ బీట్స్తో క్యాచిగా కంపోజ్ చేశారు. ఆంథోనీ దాసన్ సాంగ్ని పాడిన విధానం మరింత ఆకట్టుకుంది. ఈ సాంగ్లో లీడ్ కాస్ట్ ప్రజెన్స్ స్పెషల్ ఎట్రాక్షన్గా నిలిచింది. ఈ చిత్రంలో పాయల్ రాధాకృష్ణ కథానాయికగా నటిస్తుండగా, రాజీవ్ కనకాల, మస్త్ అలీ కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 18న విడుదల కానుంది.