హైదరాబాద్, సెప్టెంబర్ 21 (విజయక్రాం తి): ప్రొటోకాల్ ఉల్లంఘన ఆరోపణల నేపథ్యంలో నల్లగొండ విద్యుత్ ఎస్ఈపై సస్పె న్షన్ వేటు పడింది. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఎస్ఈని విధుల నుంచి సస్పెండ్ చేస్తూ టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 20న నల్లగొండలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగిన సమావేశానికి మండలి చైర్మన్, మం త్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ సమావేశానికి నోడల్ ఆఫీసర్గా నల్లగొండ ఎస్ఈని నియమించా రు. ఈ క్రమంలో సమావేశంలో కొన్ని ప్రోటోకాల్ ఉల్లంఘనలు జరిగాయని ఫిర్యాదులు అందడంతో విచారణ చేపట్టిన సీఎం డీ. సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.