నల్లగొండ, అక్టోబర్ 17 (విజయక్రాంతి): నల్లగొండ జిల్లా గుర్రం పోడు పోలీస్స్టేషన్ కానిస్టేబుల్ సత్యనారాయణపై సస్పెన్షన్ వేటు పడింది. ముల్కలపల్లికి చెందిన మహిళ హత్య కేసులో నిందితులతో కుమ్మకై ఎస్సైకి రూ.లక్ష లంచం ఇప్పించినట్టు అతడిపై అభియోగాలున్నాయి. విచారణ జరిపిన ఎస్పీ శరత్చంద్ర పవార్.. పోలీస్ ప్రతిష్ఠను దిగజార్చేలా వ్యవహరించిన కానిస్టేబుల్ను సస్పెండ్ చేస్తూ గురువారం ఉత్తర్వులిచ్చారు. ఇదే విష యంలో కొండమల్లేపల్లి సీఐ ధనుంజయకు మల్టీజోన్ ఐజీ సత్యనా రాయణ మెమో జారీ చేశారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఎస్సై నారాయణరెడ్డిని పోలీస్శాఖ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.