ఘట్కేసర్, అక్టోబర్ 5: ఘట్కేసర్కు చెందిన మాజీ ఎంపీటీసీ హత్య కేసులో ఓ కౌన్సిలర్ను తప్పించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఘట్కేసర్ ఇన్స్పెక్టర్ సైదులు సస్పెన్షన్కు గురయ్యారు. ఈ మేరకు రాచకొండ పోలీసు కమిషనర్ సుధీర్బాబు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. 2024 జూన్ 15న ఘట్కేసర్ మాజీ ఎంపీటీసీ గడ్డం మహేశ్ హత్యకు గురయ్యాడు.
ఈ హత్య కేసులో ఘట్కేసర్కు చెందిన ఓ కౌన్సిలర్ ప్రధాన పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. కాగా, నిందితులు పట్టుబడిన తర్వాత స్థల వివాదంతో పాటు అక్రమ సం బంధమే ప్రధాన కారణమని, హత్య లో కౌన్సిలర్ పాత్ర లేదని, మిగతా ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ముందు నుంచి అనుమానం వ్యక్తం చేస్తున్న మృతుని బంధువులు ఇటీవల రాచకొండ సీపీని కలిసి ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన సీపీ ఇన్స్పెక్టర్ సైదులును సస్పెండ్ చేశారు.