calender_icon.png 23 September, 2024 | 8:09 PM

హిందూత్వంపై వ్యంగ్యమైన వ్యాఖ్యలు వద్దు

23-09-2024 01:19:37 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెం బర్ 22 (విజయక్రాంతి): హిందువుల విశ్వాసాలపై నమ్మకం లేని కొందరు వ్యక్తులు తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదం వివాదంలో తలదూరుస్తు న్నారని, హిందూత్వంపై వ్యంగ్యమైన వ్యాఖ్యలు చేస్తున్నారని వీహెచ్‌పీ తెలంగాణ ప్రచార ప్రముఖ్ పగుడా కుల బాలస్వామి ఆదివారం ఓ ప్రకటనలో అభ్యంతరం వ్యక్తం చేశారు. లడ్డూ వివాదంపై నటుడు ప్రకాష్‌రాజ్ వ్యంగ్యంగా స్పందిం చడం దారుణమన్నారు. ప్రకాశ్‌రాజ్ కవ్వింపు చర్యలకు దిగి పరువు తీసుకుంటున్నారని, ఇది రాజకీయ విమర్శలకు సంబంధించిన అంశం కాదని స్పష్టం చేశారు.

ఇంకొందరు లడ్డూ కల్తీ చేస్తే ఏమవుతుందని ప్రశ్నిస్తున్నారని, హిందువుల విశ్వాసాలు నచ్చకపోతే మౌనంగా ఉండాలి కానీ, వ్యంగ్యంగా, ఎగతాళి చేసే విధంగా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. ప్రముఖులు గా చలామణి అవుతున్న కొందరు హిందూత్వంపై విమర్శలు చేస్తు తగిన రీతిలోజవాబు చెప్పేందుకు తాము సిద్ధమన్నారు.