న్యూఢిల్లీ, సెప్టెంబర్ 30: పశ్చిమాసియాలో పరిణామాలపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో సోమవారం ప్రధాని నరేంద్రమోదీ ఫోన్లో సంభాషించారు. అక్కడి ఉద్రిక్త వాతావరణంపై నెతన్యాహుతో చర్చించినట్లు మోదీ ఎక్స్లో ట్వీట్ చేశారు.పశ్చిమాసియాలో పరిస్థితులపై నెతన్యాహుతో మాట్లాడాను. ప్రపంచంలో ఉగ్రవాదానికి చోటులేదు. స్థానికంగా ఉద్రిక్తతలు తీవ్రతరం కాకుండా చర్యలు తీసుకోవడంతో పాటు బందీలను సురక్షితంగా విడుదల చేయడం చాలా ముఖ్యం. వీలైనంత త్వరగా శాంతి, స్థిరత్వాల పునరుద్ధరణ ప్రయత్నాలకు మద్దతు ఇచ్చేందుకు భారత్ కట్టుబడి ఉంది అని మోదీ స్పష్టం చేశారు.