- మహిళలతో మర్యాదగా వ్యవహరించాలి
- మంత్రి సురేఖపై సోషల్ మీడియా ట్రోల్స్పై మంత్రి పొన్నం ఆగ్రహం
కరీంనగర్, సెప్టెంబరు 30 (విజయక్రాంతి): మంత్రి కొండా సురేఖపై సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్పై రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన కరీంనగర్లో మీడియాతో మాట్లాడుతూ అధికారం శాశ్వతం కాదని, బాధ్యతగల ప్రతిపక్షాలు మహిళల పట్ల మరింత అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు.
సోషల్ మీడియాలో రాజకీయ నాయకులపై విమర్శంచదలుచుకుంటే ఓ హద్దు ఉండాలన్నారు. మహిళా మంత్రులను అవమానపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడాన్ని ఖండిస్తున్నామని, ఇది మంచి పద్ధతి కాదన్నారు. రాజకీయంగా మహిళలకు 50 శాతం కోటా ఇచ్చే విధంగా సోనియా కృషి చేశారన్నారు.
గతంలో మంత్రి సీతక్క మీద కూడా అవమానకరంగా మాట్లాడారన్నారు. అధికారంలో ఉన్నప్పుడు మహిళలకు మంత్రి పదవులివ్వని వారి గురించి, చేయలేని వ్యాపారం చేసి జైలుకు వెళ్లిన మహిళల గురించి మేం మాట్లాడడం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.