calender_icon.png 20 March, 2025 | 2:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెన్షన్ పెంపు కోసం బడ్జెట్లో నిధులేందుకు కేటాయించలేదు..?

19-03-2025 10:16:02 PM

2025-26 రాష్ట్ర బడ్జెట్లో వికలాంగులకు మొండి చెయ్యి..

బడ్జెట్ సవరించి 5శాతం నిధులు కేటాయించాలి..

ఎన్ పి ఆర్ డి ఆధ్వర్యంలో ఆర్టీసీ క్రాస్ రోడ్ లో బడ్జెట్ పత్రాల దహనం..

నేడు రాష్ట్ర వ్యాప్తంగా బడ్జెట్ పత్రాల దహనం..

ముషీరాబాద్ (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్ లో వికలాంగుల సంక్షేమనికి నిధులు కేటాయించడంలో నిర్లక్ష్యానికి నిరసనగా వికలాంగుల హక్కుల జాతీయ వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ఆర్టీసీ క్రాస్ రోడ్ లో బడ్జెట్ పత్రాలను దానం చేశారు. ఈ సందర్భంగా  సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.  వెంకట్, యం. అడివయ్య మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరంలో చేసిన అన్యాయాన్నే 2025-26 బడ్జెట్లో చేసిందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2,26,982 కోట్ల రెవెన్యూ వ్యయం బడ్జెట్లో 2016 RPD చట్టం ప్రకారం బడ్జెట్లో 5శాతం అంటే 11,349.1కోట్ల నిధులు కేటాయించాలని అన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో వికలాంగుల అభివృద్ధి, సంక్షేమనికి పైసా కూడా కేటాయించలేదని అన్నారు.

స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో అంతర్బాగంగా వికలాంగుల సంక్షేమ శాఖ చూపి నిధులు కేటాయించడం లేదన్నారు. ఇతర రంఘాలకు నిధులు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం 12 శాతం జనాభా ఉన్న వికలాంగుల సంక్షేమనికి నిధులేందుకు కేటాయించలేదని ప్రశ్నించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆసరా పెన్షన్స్ పెంచుతామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ బడ్జెట్లో పెన్షన్ పెంపు కోసం ఎందుకు నిధులు కేటాయించలేదని ప్రశ్నించారు. పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖకు 31,605 కోట్లు కేటాయించారని, ఇందులోనే ఆసరా పెన్షన్స్ బడ్జెట్ ఉండడం అంటే రాబోయే రోజుల్లో ఆసరా పెన్షన్స్ లబ్ధిదారులకు కష్టాలు తప్పవని అన్నారు. ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలో 151 అంశాలను ప్రస్థావించారని అందులో వికలాంగులకు సంబందించిన ఒక్క అంశం కూడా లేదన్నారు.

వికలాంగులకు స్వయం ఉపాధి రుణాలు, వివాహ ప్రోత్సాహకం,సహాయ పరికరాల కోసం నిధులు కేటాయించకుండా వికలాంగులకు ఏ విదంగా న్యాయం జరుగుతుందని ప్రశ్నించారు.నిధుల కొరత వలన వికలాంగుల కార్పొరేషన్ నిర్వీర్యం అయ్యే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ను సవరించి ప్రత్యేకoగా వికలాంగుల సంక్షేమా నికి బడ్జెట్ కేటాయించాలని, ఆసరా పెన్షన్స్ పెంపు కు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో NPRD రాష్ట్ర కమిటీ సభ్యులు కె చంద్రమోహన్, జె మల్లేష్, సుల్తాన్ రమేష్, నాయకులు జానీ, రాజు, శివకుమార్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.