ఢిల్లీలో ఒంటరిగానే పోటీ చేస్తాం: ఆప్
న్యూఢిల్లీ, అక్టోబర్ 9: త్వరలో జరుగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రె స్ పార్టీతో పొత్తు పెట్టుకొనే ఆలోచన లేదని ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) ప్రకటించింది. ‘ఢిల్లీలో కాంగ్రెస్తో ఆప్కు పొత్తు ఉండదు. లోక్సభ ఎన్నికల్లో యూపీ, ఢిల్లీలో కాంగ్రెస్కు అడిగినన్ని ఎంపీ సీట్లు ఇచ్చినప్పటికీ హర్యానా ఎన్నికల్లో ఆప్ను, ఎస్పీని కాంగ్రెస్ అస లు పట్టించుకోలేదు. అతి విశ్వాసానికి పోయి చతికిలపడింది’ అని ఆప్ అధికార ప్రతినిధి ప్రియాంక కక్కర్ బుధ వారం విమర్శించారు. ఫిబ్రవరిలో అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి.