12-02-2025 01:25:08 AM
నాగర్ కర్నూల్, ఫిబ్రవరి 11 (విజయ క్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లాలోని మద్యం దుకాణాల్లో సాధారణ బీర్లతో పాటు కింగ్ ఫిషర్ బీర్ నో స్టాక్ అంటూ యజమానులు బీర్లకు కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారు. సోమవారం రాష్ర్ట ప్రభుత్వం బీర్లపైన 15 శాతం ధరలు పెంచిన నేపథ్యంలో అంతకు ముందే తక్కువ ధరకు కొనుగోలు చేసిన బీర్లను స్టోరేజ్ చేసుకొని నో స్టాక్ అంటూ మంగళవారం నాగర్ కర్నూల్ జిల్లాలోని ఆయా మద్యం దుకాణాల్లో కృత్రిమ కోరత సృష్టిస్తూ మద్యం ప్రియుల జేబులకు చిల్లు లు పెడుతున్నారు.
జిల్లాలోని మద్యం దుకా ణా దారులంతా సిండికేట్ గా మారి బీర్ తాగే మద్యం ప్రియులకు కిక్కిచ్చే షాక్ ఇచ్చా రు. అసలే ఎండలు పెరుగుతున్న నేపథ్యం లో ప్రస్తుతం మద్యం ప్రియులు బీర్ వాడ కం మరింత పెంచిన నేపథ్యంలో అదును చూసి మద్యం దుకాణదారులు కూడా తమ కక్కుర్తి బుద్ధుని ప్రదర్శిస్తున్నారని మద్యం ప్రియులు మండి పడుతున్నారు.
మద్యం దుకాణదారులు బీర్లకు కృత్రిమ కొరతను సృష్టిస్తూ మంగళవారం ఉదయం నుంచి మద్యం దుకాణాలు మూసేశారు. మరికొన్ని దుకాణాల్లో వెనక నుంచి బెల్టు షాపుల యజమానులకు మాత్రమే బీర్లను అధిక ధ రకు అమ్ముకొని సరఫరా చేస్తున్నట్లు ఆరో పణలు ఉన్నాయి. ఈ విషయంపై జిల్లా ఎక్సు జ్ శాఖ అధికారులకు మద్యం ప్రియులు ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోవడం లేదం టూ ఆరోపణలు వెలువెత్తుతున్నాయి.