హైదరాబాద్,(విజయక్రాంతి): గచ్చిబౌలిలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హస్పిటల్ మేనేజ్ మెంట్ (నిథిమ్)లో భవన నిర్మాణాన్ని కూల్చివేసింది. సర్వే నం.71లోని రామన్నకుంట చెరువు బఫర్ జోన్ లో చేసిన అక్రమ నిర్మాణాలను నిథిమ్ స్వచ్చందంగా కూల్చివేసింది. నిథిమ్ యాజమాన్యం చెరువు బఫర్ జోన్ లో కొత్తగా భవన నిర్మాణం చేపట్టింది. బఫర్ జోన్ లో నిర్మాణాలపై పలు స్వచ్చంద సంస్థలు, హెన్ఆర్సీపీసీ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాలతో నిథిమ్ సిబ్బంది స్వచ్ఛందంగా భవన నిర్మాణాలు కూల్చివేశారు.