calender_icon.png 11 October, 2024 | 5:02 AM

శాస్త్రవేత్త జోషికి ‘నిట్’ పురస్కారం

11-10-2024 12:38:19 AM

హనుమకొండ, అక్టోబర్ 10 (విజయక్రాంతి): హైదరాబాద్ డీఆర్డీఎ ల్ ప్రోగ్రామ్ డైరెక్టర్, శాస్త్రవేత్త డాక్టర్ జైతీర్థ్ ఆర్ జోషి అరుదైన పురస్కారానికి ఎంపికయ్యారు. కాజీపేటలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) క్యాంపస్‌లో గురువారం నిర్వహించిన నిట్ వార్షికోత్సవంలో ఆయన అతిథుల చేతుల మీదుగా నిట్ విశిష్ట పూర్వ విద్యార్థి పురస్కా రం అందుకున్నారు. కార్యక్రమంలో డాక్టర్ గ్లోరీ స్వరూప, నాగార్జున వెన్న, ప్రొఫెసర్ వీరాచారి, ఎం.శివా జీ యాంద్ పాల్గొన్నారు.