హైదరాబాద్(విజయక్రాంతి): సరికొత్త టెక్నాలజీతో రూపొందించిన నిస్సాన్ న్యూ మ్యాగ్నైట్ కారును ఆదివారం నటీమణి వర్షిణి సౌందర్ రాజన్ మఖ్య అతిథిగా హాజరై ఎర్రగడ్డలోని వైబ్రెంట్ నిస్సాన్ షోరూంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ సిరాజ్ బాబుఖాన్ మాట్లాడుతూ న్యూ టెక్నాలజీ, ౪౦ ప్లస్ సేఫ్టీ స్టాండర్ట్ ఫీచర్లు ఉన్న ఈ కారు ప్రారంభ ధర రూ. ౫.౯౯ లక్షలలో అందరికీ అందుబాటులో ఉంటుందన్నారు.
ఇఈ నూతన మోడల్ విసియా, విసియా+, యాసెంటా, ఎన్కనెక్టా, టెక్నా, టెక్నా+ వేరియంట్లలో లభించనుందని, ఇందులో అమర్చిన ౧.౦ లీటర్ టర్బోఛార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ ౯౮ బీహెచ్పీ, ౧౬౦ ఎన్ఎం టార్క్ను అందిస్తుందని నిస్సాన్ ఏరియా సేల్స్ మేనేజర్ అశోక్కుమార్ అన్నారు.
౫ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ లేదా సీవీటి గేర్బాక్స్ల్లో ఈ కారు లభిస్తుందని, ౬ ఎయిర్ బ్యాగ్లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్స్టార్ట్ అసిస్ట్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ వ్యవస్థ, ఈబీడీతో కూడిన ఏబీఎస్, ట్రాక్షన్ కంట్రోల్ వంటి భద్రతా ఫీచర్లు ఈ కారులో ఉన్నాయని తెలిపారు.