నిర్మల్, ఆగస్టు 11(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాను రాంజీగోండు జిల్లాగా పేరు మార్చాలని ఆదివాసి గిరిజన సంఘ రాష్ట్ర కార్యదర్శి బీ రవికుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఆదివాసీ సదస్సుకు హాజరయ్యారు. ఈ ప్రాంత ప్రజల హక్కుల కోసం పోరాడిన గొప్ప వ్యక్తి రాంజీగోండు అని అన్నారు. నైజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్య మం చేసిన చరిత్ర నిర్మల్కు ఉందని గుర్తుచేశారు. రాంజీగోండ్ స్ఫూర్తితో గిరిజన ఆదివాసి హక్కుల కోసం పోరాటాలు చేస్తున్నామని తెలిపారు.