10-03-2025 05:37:49 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలోని పోనకల్ గోదావరి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయ గోపుర నిర్మాణానికి నిర్మల్ డిసిసి అధ్యక్షులు శ్రీహరి రావు సోమవారం 100116 రూపాయల విరాళం అందించారు. అంతకుముందు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గంగారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ఏనుగు లింగారెడ్డి తదితరులు ఉన్నారు.