calender_icon.png 24 October, 2024 | 8:42 AM

వేర్వేరు కారణాలతో తొమ్మిది మంది మృతి

29-08-2024 04:16:19 AM

కుమ్రంభీం ఆసిఫాబాద్, ఆగస్టు 28 (విజయక్రాంతి): రోడ్డు ప్రమాదాలు సంభవించి కొందరు, బలవన్మరణాలకు పాల్పడి మరికొందరు, గుండెపోటుతో ఒకరు మృతిచెందారు. ఆసిఫాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం నర్సాపూర్ చెందిన గుగ్గె కిరణ్ (26) ఆన్‌లైన్ బెట్టింగ్ ఆడి అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల కేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో శేషగిరి నాగేశ్వరరావు (63), అశ్వారావుపేట మండల పరిధిలోని సత్తుపల్లి జాతీయ రహదారిపై నారంవారిగూడెం సమీపంలో జరిగిన  రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. వరంగల్ జిల్లా వర్థన్నపేట మండలం ఇల్లందలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కుమ్మరిగూడేనికి చెందిన బిల్యా నాయక్ (56) చనిపోయాడు.

కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం కౌలాస్ గ్రామానికి చెందిన ఓ యువకుడు విద్యుదాఘాతంతో ప్రాణాలు కోల్పోయాడు. నాగర్‌కర్నూల్ జిల్లా  మండలం వనపట్ల శివారులో రోడ్డుప్రమాదం సంభవించి రాసోజు వెంకట కృష్ణయ్య (40) దుర్మరణం  చెందాడు. వనపర్తి జిల్లాలోని పామిరెడ్డిపల్లిలో రోడ్డు ప్రమాదం సంభవించి బోయ అశోక్, బోయ చందు అనే ఇద్దరు యువకులు మృతిచెందారు. ఆగిఉన్న లారీని వేగంగా మరో లారీ ఢీకొట్టి మాక్లూర్ మండలం చికిలి గ్రామానికి చెందిన దండ్ల వంశీ (17) మృతిచెందాడు. ఆసిఫాబాద్ జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న సాఫ్ట్ నర్స్ రమాదేవి (39) మంగళవారం రాత్రి గుండెపోటుతో మృతిచెందారు. ఆమె మృతదేహానికి వైద్యారోగ్యశాఖ అధికారులు, వైద్యులు, సిబ్బంది నివాళి అర్పించారు.