calender_icon.png 27 September, 2024 | 4:57 PM

గంజాయి కేసులో తొమ్మిది మంది అరెస్ట్

27-09-2024 01:04:24 PM

6 సెల్ ఫోన్లు, 4బైకులు,రూ 3,750 నగదు స్వాధీనం 

బెల్లంపల్లి (విజయక్రాంతి): గంజాయి అమ్మకం, సేవించడం కేసులో నెన్నెల మండలంలో 9 మంది వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను నెన్నల పోలీస్ స్టేషన్లో ఏసిపి రవికుమార్ వెల్లడించారు. నే న్నెల చెరువు వద్ద నమ్మదగిన సమాచారం మేరకు ఎస్సై ప్రసాద్ సిబ్బందితో వెళ్లగా అక్కడ కొంతమంది కనిపించారు. పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేశారు.

బెల్లంపల్లి మండలం తాళ్ల గురజాల మహమ్మద్ ముస్తఫా ను పట్టుకుని అతని చేతిలో ఉన్న కవర్ని పరిశీలించగా అందులో169 గ్రాముల గంజాయి లభించింది. వెంటనే పారిపోతున్న పోతరాజుల ఆకాష్ (ఘన్ పూర్), శనిగారపు ఆనంద్ (చర్లపల్లి), జాడి సుందర్ (దుగ్గినపల్లి), దుర్గం స్వామి (నేన్నెల), పిట్ట శేఖర్ (నెన్నె ల), రత్నం దేవేందర్ (గుండ్ల సోమవారం) లను అరెస్టు చేసినట్టు చెప్పారు. వీరి వద్దనుండి 6 సెల్ ఫోన్లు,4 బైక్ లతో పాటు రూ 3,750 నగదు ను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు .వీరిని చాకచక్యంగా పట్టుకున్న ఎస్సై ప్రసాద్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి రూరల్ సిఐ సయ్యద్ అఫ్జలొద్దీన్ పాల్గొన్నారు.