హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 6 (విజయక్రాంతి): నిమ్స్ ఆసుపత్రిలో అనస్తీషియా అడిషినల్ ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తున్న ప్రాచీకర్ (46) ఆత్మహత్య చేసుకున్నారు. శుక్రవారం అర్ధరాత్రి బేగంపేట బ్రాహ్మణవాడిలోని తన ఇంట్లో అధిక మోతాదులో అనస్తీషియా తీసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆమె పక్కనే అనస్తీషియా వాయిల్ పడి ఉండటం గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం నిమ్స్ అసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ప్రాచీకర్ మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.