‘స్వయంభు’ చిత్రంతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న హీరో నిఖిల్ సిద్ధార్థ కథానాయకుడిగా నటిస్తున్న మరో చిత్రం ప్రారంభమైంది. ‘ది ఇండియా హౌస్’ పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు కోర్ టీమ్ సమక్షంలో హంపీలోని విరూపాక్ష దేవాలయంలో సోమవారం జరిగ్గా, రెగ్యులర్ షూటింగ్ మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ సినిమాలో సాయి మంజ్రేకర్ కథానాయికగా నటిస్తోంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
గతంలో ఈ నటుడు నిఖిల్ హీరోగా నటించిన ‘కార్తికేయ౨’లోనూ కనబడ్డారు. టాలీవుడ్ స్టార్ హీరో రామ్చరణ్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వి మెగా పిక్చర్స్ సంస్థలు నిర్మిస్తున్న ఈ చిత్రానికి రామ్ వంశీకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. 1905 బ్యాక్డ్రాప్లో లవ్, రెవెల్యూషన్ థీమ్తో ఈ పీరియాడిక్ డ్రామా తెరకెక్కు తోంది. ఈ చిత్రానికి డీవోపీ: కామెరూన్ బ్రైసన్; ప్రొడక్షన్ డిజైనర్: విశాల్ అబానీ; కాస్ట్యూమ్స్ డిజైనర్: రజిని.