మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల
నాగోల్లో ఆత్మయ సమ్మేళనం
ఎల్బీనగర్, మే 4: పెరిక(పురగిరి క్షత్రియ) కులస్థులు సహసానికి మారుపేరు అని మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. శనివారం నాగోల్లోని శుభం కన్వేన్షన్లో పెరిక కులస్థుల ఆత్మీయ సమ్మేళనానికి ఈటల హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. పెరిక కులస్థుల సంక్షేమానికి బీజేపీ కట్టుబడి ఉన్నదని చెప్పారు. రాజకీయాల్లో కులం, ధనం మాత్రమే ప్రభావం చూపవని, అభ్యర్థి వ్యక్తిత్వం కూడా కీలకం అని పేర్కొన్నారు.
ఉద్యమ నాయకుడిగా, మంత్రిగా తాను చేసిన అభివృద్ధిని చూసి తనను గెలిపించాలని కోరారు. తానూ వెనబడిన కులం నుంచే వచ్చానని, పేదప్రజల సంక్షేమానికి కృషి చేస్తానని చెప్పారు. ఎంపీగా గెలిచిన తర్వాత ఎల్బీనగర్ అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతానని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో పెరిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మద్దా లింగయ్య, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, నాయకులు కందుల లింగయ్య, గటిక విజయ్కుమార్, దాసరి మల్లేశం, విజయ్భాస్కర్, పరమేశ్, కల్నల్ శ్రీనివాస్, దయానంద్, దాసరి ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.