calender_icon.png 21 September, 2024 | 1:02 AM

రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు వర్షాలు

27-07-2024 10:27:53 PM

హైదరాబాద్: అల్పపీడన ప్రభావంతో మరో మూడు రోజులు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఒక మోస్తరు వర్షం కురుస్తుందని వాతావరణశాఖ  ఒక ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ ఎలర్ట్ జారీ చేసింది.శనివారం నారాయణ పేట, వనపర్తి, జోగులాంబ గద్వాల్ జిల్లాలో భారీ వర్షం కురవగా, వికారాబాద్,  మహాబూబ్‌నగర్,నాగర్ కర్నూల్, నల్గొండ, ఖమ్మం,భద్రాచలం కొత్తగూడెం, ములుగు, హన్మకొండ, సిద్దిపేట, కరీంనగర్, ములుగు, పెద్దపల్లి, జయశంకర్, రాజన్న సరిసిల్ల, జగిత్యాల, నిజామాబాద్,  మంచిర్యాల, నిర్మల్ ఆదిలాబాద్, కుమ్రం బీమ్ జిల్లాల్లో ఒక మోస్తరు వర్షపాతం నమోదైనుట్ల అధికారులు తెలిపారు. కామారెడ్డి.మెదక్, సంగారెడ్డి, మేడ్చెల్ మల్కాజిగిరి, యాద్రి భువనగిరి,జనగాం, సూర్యాపేట,మహాబూబాబాద్, హైదరాబాద్ జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది.

ఉమ్మడి తెలంగాణలోని 10 జిల్లాల్లో శనివారం నమోదైన  వర్షపాతం  వివరాలు

ఆదిలాబాద్ 9.9, ఖమ్మం 7.8, హైదరాబాద్ 7.8, కరీంనగర్ 7.4, వరంగల్ 7.0, నిజామాబాద్ 6.2, రంగారెడ్డి 5.8, నల్గొండ 5.7, మహాబూబ్‌నగర్ 4.8, మెదక్ 4.6.