24 May, 2026 | 4:20 PM

వడూర్ బుద్ధికొండ రహదారిపై పులి సంచారం సోషల్ మీడియాలో ప్రచారం

24-05-2026 03:23 PM

బోథ్,(విజయక్రాంతి): నేరడిగొండ మండలంలోని వడూర్ బుద్ధికొండ రహదారి పైన ఆదివారం ఉదయం నాలుగున్నర గంటల ప్రాంతంలో పులి సంచరించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నది. ఆ రహదారి మీదుగా వెళుతున్న వారు పులిని చూసినట్లు పేర్కొంటూ ఫోటోలు పెట్టడం జరిగింది. వడూర్ అడవుల్లో నుండి వెళ్లిన పులి రోడ్డు దాటుతూ కనిపించిందని పేర్కొంటున్నారు.

కాగా పులి సంచారం పైన వాస్తవాలను తెలుసుకునేందుకు విజయ క్రాంతి సంబంధిత అటవీ శాఖ అధికారి గణేష్ ని వివరణ కోరగా విషయం తమ దృష్టికి వచ్చిందని పులి సంచరిస్తున్నది వాస్తవమా కాదా అని తెలుసుకునేందుకు సిబ్బందితో పాటు వెళ్లడం జరిగిందని మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు పులి పాదముద్రలు ఎక్కడ కనిపించలేదని పేర్కొన్నారు. ఇంకా తమ సిబ్బంది తో పాటు పాద ముద్రలు గుర్తించే పనిలో ఉన్నామని పులి ఉన్నట్లు తేలితే ప్రజలను అప్రమత్తం చేస్తామన్నారు.