19 May, 2026 | 10:20 PM

Breaking News

ఖమ్మం - సూర్యాపేట జాతీయ రహదారిపై రాస్తారోక చేస్తున్న మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్   •   డీజీపీ సీవీ ఆనంద్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ డిసిసిబి చైర్మన్   •   రూ.21.49 లక్షల విలువైన నకిలీ వరి విత్తనాల పట్టివేత   •   హిజ్రాల ఆగడాలకు చెక్ పెట్టేందుకు పోలీస్ శాఖ చర్యలు   •   పీహెచ్సీలో అందిస్తున్న వైద్య సేవల పరిశీలన   •   ధాన్యం అన్‌లోడింగ్‌లో జాప్యం లేకుండా వెంటనే చర్యలు తీసుకోవాలి   •   ఆందోళన వద్దు.. బంద్ రోజున మందులు అందుబాటులోనే   •   మంగళవారం సంతలో పూర్తిగా ట్రాఫిక్ అంతరాయం   •   మొక్కజొన్న స్టాక్ పాయింట్లను తనిఖీ చేసిన డీఎం   •   ఖానాపూర్ మండలంలో పైలట్ గ్రామాన్ని సందర్శించిన అధికారులు   •  

భారత్‌తో న్యూజిలాండ్ అమీతుమీ

06-03-2025 01:08 AM
  1. చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు కివీస్
  2. సెమీస్‌లో దక్షిణాఫ్రికాపై ఘన విజయం
  3. మార్చి 9న టైటిల్ పోరు

లాహోర్: ప్రతిష్ఠాత్మక ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో ఆదివారం జరగనున్న ఫైనల్లో భారత్‌తో న్యూజిలాండ్ అమీతుమీ తేల్చుకోనుంది. బుధవారం లాహోర్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన రెండో సెమీఫైనల్లో న్యూజి లాండ్ 50 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 362 పరుగుల భారీ స్కోరు చేసింది.

రచిన్ రవీంద్ర (108), కేన్ విలియమ్సన్ (102) శతకాలతో చెలరేగారు. సఫారీ బౌలర్లలో ఎన్గిడి మూడు వికె ట్లు తీయగా.. రబాడ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 312 పరుగులకు పరిమితమైంది. మిల్లర్ (100 నాటౌట్), డసెన్ (69), బవుమా (56) రాణించారు.

కివీస్ బౌలర్లలో మిచెల్ సాంట్నర్ 3 , హెన్రీ, గ్లెన్ ఫిలిప్స్ చెరో 2 వికెట్లు తీశారు. కాగా న్యూజిలాండ్ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో అడుగుపెట్టడం ఇది మూడోసారి. 2000 లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్‌ను ఓడించి టైటిల్ గెలిచిన సంగతి తెలిసిందే.