calender_icon.png 4 October, 2024 | 10:53 PM

నూతన విద్యుత్ ప్లాంటును జెన్కో ఆధ్వర్యంలో నిర్మించాలి

04-10-2024 07:43:25 PM

మందమర్రి,(విజయక్రాంతి): రామగుండంలో నూతనంగా నిర్మించనున్న థర్మల్ విద్యుత్ ప్లాంట్ ను జెన్కో ఆధ్వర్యంలో నిర్మించాలని మంచిర్యాల ఏడిఈ రాజ్ కుమార్ కోరారు. శుక్రవారం పట్టణంలోని మందమర్రి(వి) 220 కెవి విద్యుత్ సబ్ స్టేషన్ లో విద్యుత్ ఉద్యోగులతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పెద్దపల్లి జిల్లా రామగుండంలో కాలం చెల్లిన 55.5 మెగా వాట్స్ థర్మల్ ప్లాంట్ ను ప్రభుత్వం శిధిలం చేసి దాని స్థానంలో మరో 8 వందల మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ ను నిర్మించడానికి సన్నాహాలు చేస్తుందన్నారు. ప్లాంట్ నిర్మాణం బాధ్యతలు మొత్తం జెన్కో ఆధ్వర్యంలో జరగాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఇందులో సింగరేణి ప్రభుత్వం కలిసి థర్మల్ ప్లాంట్ నిర్మించాలని చూస్తోందని, ప్రభుత్వం వెంటనే ఆ ఆలోచనను విరమించుకొని జెన్కోకు పూర్తిస్థాయి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం బాధ్యతలు అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సబ్ స్టేషన్ ఏఈ వేముల మౌనిక, ఎల్ ఐ రాజేంద్రప్రసాద్, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.