calender_icon.png 17 October, 2024 | 7:20 AM

వికారాబాద్‌కు నూతన మాస్టర్ ప్లాన్

17-10-2024 03:00:29 AM

డ్రోన్ డిజిటల్ సర్వేను ప్రారంభించిన చైర్‌పర్సన్ చిగుళ్లపల్లి మంజుల 

వికారాబాద్, అక్టోబర్ 16 (విజయక్రాంతి): వికారాబాద్ మున్సిపాలిటీకి త్వరలో నూతన మాస్టర్ ప్లాన్ తయారు కానుందని.. భవిష్యత్ తరాలకు అన్ని డిజిటలైజేషన్ చేయడమే లక్ష్యంగా ఈ ప్లాన్‌ను రూపొందిస్తున్నట్లు మున్సిపల్ చైర్‌పర్సన్ చిగుళ్ల పల్లి మంజుల రమేశ్ తెలిపారు. బుధవారం పట్టణంలో డ్రోన్ కెమెరాలతో మాస్ట ర్ ప్లాన్ డిజిటల్ సర్వేను ప్రారంభించారు.

ఈ సందర్బంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అమృత్ 2.0 స్కీమ్ కింద రాష్ట్రంలో 50వేల నుంచి లక్ష జనాభా ఉన్న 20 మున్సిపాలిటీలను మాస్ట ర్ ప్లాన్ కింద డిజిటల్ సర్వే చేసేందుకు ఎంపిక చేసిందన్నారు. ఇందులో వికారాబాద్ మున్సిపాలి టీ కూడా ఉందని.. దీనిలో భాగంగానే డిజిటల్ సర్వే ప్రారంభించినట్లు తెలిపారు. ప్రస్తుత అవసరాలకు తగ్గట్లుగా ఈ మాస్టర్ ప్లాన్ సిద్దం చేస్తున్నామన్నారు.