calender_icon.png 26 October, 2024 | 9:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

మలేసియా తెలంగాణ అసోసియేషన్ నూతన కార్యవర్గం

22-07-2024 01:38:49 AM

హైదరాబాద్, జూలై 21 (విజయక్రాంతి): వృత్తి రీత్యా మలేసియా వచ్చి సమాజ సేవకు  ఒక వేదికను ఏర్పాటు చేసి ఆపదలో ఉన్న వారికి చేయూతనిస్తున్న  ‘మైటా’ను ఎమ్మెల్సీ, ఏఐసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మ మహేష్‌కుమార్‌గౌడ్  ప్రశంసించారు. ఆదివారం మలేషియా తెలంగాణ అసోసియేషన్ నూతన కార్యవర్గ కమిటీ ప్రకటించి మైటా కార్యవర్గ ఎన్నికలకు ప్రాతినిధ్యం వహించిన అమర్‌నాథ్‌గౌడ్‌ను అభినందించారు. నూతన కార్యవర్గ సభ్యులకు అభినందనలు తెలుపుతూ  భవిష్యత్తులో ఈ సంఘం చేసే కార్యక్రమాలకు తెలంగాణ ప్రభుత్వం తరఫున కావాల్సిన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.

అనంతరం ప్రెసిడెంట్ సైదం తిరుపతి ప్రసంగిస్తూ మైటా ఏర్పాటు చేసి 10 సంవత్సరాలు పూర్తి కావస్తున్న సందర్భంగా అసోసియేషన్ ఏర్పాటు చేసిన రోజులు గుర్తు వస్తున్నాయన్నారు. కమిటీ సభ్యుల ప్రాధాన్యత, నడివడికలు నూతన సభ్యులకు మార్గదర్శకంగా ఉంటాయని తెలిపారు. నూతన కార్యవర్గంలో ప్రెసిడెంట్‌గా సైదం తిరుపతి,  వైస్ ప్రెసిడెంట్‌గా చిరుత చిట్టిబాబు, మహిళా ప్రెసిడెంట్‌గా కిరణ్మయి, జనరల్ సెక్రటరీగా సందీప్‌గౌడ్, జాయింట్ సెక్రటరీగా సత్యనారాయణరావు, కోశాధికారి సందీప్‌కుమార్ లగ్గిశెట్టి, జాయింట్ ట్రెజరర్ సుందర్ రెడ్డి, యూత్ ప్రెసిడెంట్‌గా సంతోష్ దానరాజు, వైస్ ప్రెసిడెంట్‌గా శివతేజ, కార్యవర్గ సభ్యులుగా మారుతి హరిప్రసాద్, రాములు, రమేష్, మహేష్, శ్రీహరి, జీవంరెడ్డి, వినోద్, రఘుపాల్ రెడ్డి, రంజిత్ రెడ్డి ఎన్నికయ్యారు.