హైదరాబాద్, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): నూతన గురుకుల డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేయాలని, గు రుకుల పాఠశాలలు, కాలేజీల టైం టేబుల్ను మార్చాలని పీఆర్జీటీఏ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈమేరకు సీఎం సలహాదారుడు వేం నరేం దర్రెడ్డిని నేతలు శనివారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భం గా పలు సమస్యలు ఆయన దృష్టికి నాయకులు తీసుకెళ్లారు. ఉద్యోగులకు 010 పద్దు ద్వారా జీతం ఇవ్వాలని, గురుకులాల్లో కేర్ టేకర్లను నియమించాలని కోరారు.