calender_icon.png 9 October, 2024 | 4:53 PM

నిర్మల్‌కు కొత్త ఏఈలు వచ్చేశారు..

09-10-2024 12:08:27 AM

నిర్మల్, అక్టోబర్ 8 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా మిషన్ భగీరథ కార్యాలయంలో మంగళవారం కొత్తగా ఎంపికైన ఏఈవోలు బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే రాష్ట్రంలో ఏఈలను ఎంపిక చేసి ఉద్యోగ నియామక పత్రాలు అందించింది. నిర్మల్ జిల్లాకు ఆరుగురు అభ్యర్థులను కేటాయించడంతో వారు జిల్లా కార్యాలయంలో ఈఈ సందీప్‌కు జాయినింగ్ రిపోర్టును అందించారు. వారిని ఈఈ సందీప్ అభినందించి, ప్రజలకు ఉన్నతమైన సేవలందించాలని సూచించారు.