calender_icon.png 7 October, 2024 | 5:56 PM

వైద్యుల నిర్లక్ష్యం.. వరుసగా చిన్నారులు మృతి

07-10-2024 03:53:43 PM

హన్మకొండ జిల్లా : హనుమకొండ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. డాల్ఫిన్ చిల్డ్రన్ హాస్పిటల్ వరుసగా చిన్నారులు మృతి చెందుతున్నారు. జ్వరంతో రక్షిత అనే  పాప హనుమకొండలోని డాల్ఫిన్ హాస్పిటల్లో అడ్మిట్ కాగా వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే పాప చనిపోయింది అంటూ హాస్పిటల్ ఎదుట బంధువుల ఆందోళన చేశారు. వరుసగా డాల్ఫిన్  హాస్పిటల్ లో  పిల్లలు మరణించడానికి గల కారణం వైద్యుల నిర్లక్ష్యమేనని బంధువులు ఆరోపిస్తున్నారు.