21-04-2025 12:11:21 AM
మందులు లేక ఇబ్బందులు
మూగ జీవాల అత్యవసర వైద్యంపై నిర్లక్ష్యం
పెండింగ్ల్లో 1962 సిబ్బంది వేతనాలు
సంగారెడ్డి, ఏప్రిల్ 20(విజయక్రాంతి): మూగజీవాలకు అత్యవసర సేవలు అందిం చేందుకు ప్రభుత్వం 1962 సంచార వైద్యశాలలను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే కొన్ని నెలలుగా మందులు సరఫరా కావడం లేదు. దీనికి తోడు సిబ్బంది వేతనాలు కూడా పెండింగ్లో ఉండడంతో ఇబ్బం దులు పడుతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఈ సమస్య నెలకొంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏరియా వెటర్నరీ వైద్యశాలలు(ఏవీహెచ్), ప్రైమరీ వెటర్నరీ వైద్యశా లలు(పీవీహెచ్), సంబ్ సెంటర్లు ఉన్నాయి. వీటితో పాటు నియోజకవర్గానికి ఒక సంచా ర వైద్యశాల వాహనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ రకంగా ఉమ్మడి జిల్లాలో సుమారు పది వరకు సంచార పశువైద్యశాల వాహనాలు ఉన్నట్లు సమాచారం. అయితే వాటిలో పనిచేసే సిబ్బంది కోసం రూం కానీ, ఇతర ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేయలేదు.
వాహనానికి నలుగురు...
ప్రతీ వాహనంలో డాక్టర్, కాంపౌండర్, డ్రైవర్, హెల్పర్ ఉన్నారు. దీనికి సంబంధిం చి ప్రధాన కార్యాలయం హదరాబాద్లో ఉంది. 1962కు కాల్ చే యగానే వారు నమో దు చేసుకుంటారు. ఆ కాల్స్ ఆధారంగా వాహనాల డాక్టర్లకు షెడ్యూల్ ఇస్తారు. దాని ప్రకారం ఆయా గ్రామాలకు వెళ్ళి మూగజీవాలకు చికిత్స చేస్తారు. కాగా ఎమర్జెన్సీ మెసేజ్మెంట్ రీసెర్ఛ్ ఇన్స్టిట్యూట్ (ఐఎంఆర్ఐ), జీవీకే, గ్రీన్హెల్త్ సర్టికల్ సంస్థలకు ప్రభుత్వం నిర్వహణ బాధ్యతలను అప్పగించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ సంస్థల ఆధ్వర్యంలో అవుట్ సోర్సింగ్లో సిబ్బంది నియామకం, మందులు అందజేస్తారు.
నాలుగు నెలలుగా మందులు బంద్...
నాలుగైదు నెలల నుంచి మందులు రావడం లేదని సిబ్బంది చెబుతున్నారు. కనీసం సిరంజీలు కూడా లేక వెటర్నరీ వైద్యశాలలో అడిగి తీసుకెళ్తున్నామని వాపోతున్నారు. మందులు లేవని, బయట తెచ్చకో వాలని చెబుతున్నట్లు రైతులు అంటున్నారు. మందులు లేక పశువులకు పూర్తిస్థాయిలో చికిత్స అందడం లేదు. పశువైద్యశాలలకు కూడా సంవత్సరానికి మూడుసార్లు సరఫ రా చేస్తున్నారని, అవి కూడా సరిపోవడం లేదని వెటర్నరీ వైద్యులు అంటున్నారు. మం దుల కొరతతో అరకొర చికిత్స చేయాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వేతనాలు రాక ఇబ్బందులు..
సంచార పశువైద్యశాలలో పనిచేస్తున్న సిబ్బందికి సుమారు ఐదు నెలులగా వేతనాలు రావడం లేదని తెలిసింది. మరికొంత మంది మాత్రం మూడు నెలల వేతనాలు విడుదల చేసినట్లు చెబుతున్నారు. అయినప్పటికీ సిబ్బందికి వేతనాలు నెలనెలా ఇవ్వక పోవడంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ విషయంలో మెదక్ జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి వెంకటయ్యను వివరణ కోర గా వాటితో తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు.
కాగా సంచార వైద్యశాల విషయంలో సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి మందుల కొరత, వేతనాల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మూగ జీవాలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని రైతులు కోరుతున్నారు.