calender_icon.png 29 September, 2024 | 7:58 PM

జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా నీలి శ్రీనివాసులు

29-09-2024 05:40:16 PM

అలంపూర్,(విజయక్రాంతి): గద్వాల జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్మన్ గా ఎర్రవల్లికి చెందిన నీలి శ్రీనివాసులు పేరు ఖరారు అయ్యింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్టు ఆయన తెలిపారు. అయితే గత కొన్ని రోజులుగా ప్రభుత్వం నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తున్న సంగతి విదితమే. నీలి శ్రీనివాసులు గతంలో ఎర్రవల్లి ఎంపీటీసీగా పని చేశారు. ఈ మధ్య కాలంలోనే కాంగ్రెస్ పార్టీలో చేరి పార్టీలో క్రియాశీలకంగా పని చేస్తున్నారు. ఈతరుణంలో కాంగ్రెస్ పార్టీ తనని గుర్తించి తగిన స్థానం ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ నేతృత్వంలో బీసీ బోయ వాల్మీకిలను గుర్తించి పార్టీలో సముచిత స్థానం కల్పించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. త్వరలో పార్టీ పెద్దల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లా గ్రంధాలయ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.