calender_icon.png 11 October, 2024 | 6:51 PM

Breaking News

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు

11-10-2024 04:25:06 PM

పటాన్చెరు (విజయక్రాంతి): రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నీలం మధు శుక్రవారం హైదరాబాదులోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. రాష్ట్రంలో బీసీల సామాజిక, ఆర్థిక, కుల సర్వేపై తీసుకున్న నిర్ణయం పట్ల ఆయన కృతజ్ఞతలు తెలిపారు. దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించబోతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.