న్యూఢిల్లీ: ఛత్తీస్గఢ్లో శనివారం భారీ ఎన్ కౌంటర్(Encounter) జరిగింది. భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందారు. బీజాపూర్ జిల్లా గంగలూర్ పోలీస్ స్టేషన్(Bijapur District Gangapur Police Station) పరిధిలోని అటవీప్రాంతంలో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఉదయం నుంచి ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. గంగలూరు అడవుల్లో మావోయిస్టుల(Maoists) కోసం భద్రతా బలగాలు గాలిస్తున్నాయి.