18-02-2025 12:00:00 AM
పాల్గొన్న ఖానాపూర్ ఎమ్మెల్యే
దస్తురాబాద్, ఫిబ్రవరి 17 : మండలంలోని బుట్టాపూర్ గ్రామంలోని హనుమన్ ఆలయం లో నవ గ్రహాల,ధ్వజ స్తంభ ప్రతిష్టాపన పూజలలో ఖానాపూర్ నియోజకవర్గ శాసనస భ్యులు వెడ్మ బొజ్జు పటేల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హనుమంతుడితో పాటు నవ గ్రహాలను పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తానని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.