calender_icon.png 24 October, 2024 | 3:57 AM

ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం...

29-08-2024 03:23:38 PM

హాకీ మంత్రికుడు ధ్యాన్ చంద్ విగ్రహానికి నివాళులర్పించిన కలెక్టర్, ఎమ్మెల్యే...

ఆదిలాబాద్, (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో గురువారం జాతీయ క్రీడా దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ రాజార్షిషా, ఎమ్మెల్యే పాయల్ శంకర్ హాజరయ్యారు. ముందుగా హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్ చంద్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం క్రీడా జ్యోతి ని వెలిగించి ర్యాలీ చేపట్టారు. వివిధ క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందజేశారు. జాతీయస్థాయిలో మెడల్స్ సాధించిన వారికి క్రీడా దుస్తులు అందించి సన్మానించారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ క్రీడా ప్రాంగణంలో 400 మీటర్ల సింథటిక్ ట్రాక్, హాకీ కోసం ఆస్ట్రో టర్ఫ్, అంతర్జాతీయ ప్రమాణాలతో 50 మీటర్ల స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు కోసం ప్రభుత్వానికి నివేదికలు పంపిస్తామని పేర్కొన్నారు. ఆరోగ్యంగా ఉండేందుకు ఆటలు ఎంతో దోహదపడుతాయని వివరించారు. జిల్లాలో క్రీడల అభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో క్రీడల అబివృద్ది అధికారులు వెంకటేశ్వర్లు, గిరిజన క్రీడల అభివృద్ధి అధికారి పార్థసారథి, ఒలంపిక అసోసియేషన్ అధ్యక్షులు బాలూరి గోవర్ధన్ రెడ్డి, ఆయా క్రీడా సంఘాల బాధ్యులు, క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.