23 May, 2026 | 2:28 PM

Breaking News

నేరెళ్ళ బాలికల గురుకులంలో బోధనా సిబ్బంది నియామకాలకు దరఖాస్తుల ఆహ్వానం   •   ఇచ్చిన మాట నిలబెట్టుకున్న తంగళ్ళపల్లి సర్పంచ్   •   వినియోగదారులకు చేరువగా టీజీఎన్పీడీడీసీఎల్ యాప్   •   మండుతున్న ఎండలకు నిర్మానుష్యంగా దమ్మపేట మెయిన్ రోడ్డు   •   పుణ్య నాయక్ తాండ చింతలపూడి మధ్య వాగుపై వంతెన నిర్మించండి   •   రైతుల సమస్యలపై ఎమ్మార్వో కార్యాలయం ఎదుట బీజేపీ నిరసన   •   జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన డీసీసీ అధ్యక్షులు   •   నూతన అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం   •   సహకార సంఘం ఎదుట జొన్న రైతుల నిరసన   •   తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను 30 నెలలైనా నెరవేర్చలేదు   •  

జాతీయా పారా గేమ్స్ మస్కట్, లోగో విడుదల

29-01-2025 11:44 PM

ఫిబ్రవరి 17 నుంచి 20 వరకు టోర్నీ నిర్వహణ

చెన్నై: 23వ జాతీయ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ 2025కు సంబంధించి బుధవారం చెన్నై వేదికగా అధికారిక లోగోతో పాటు మస్కట్‌ను విడుదల చేశారు. ఫిబ్రవరి 17 నుంచి 20 వరకు జరగనున్న చాంపియన్‌షిప్ పోటీల్లో దేశవ్యాప్తంగా 1700 మంది పారా అథ్లెట్లు బరిలోకి దిగనున్నట్లు తెలిసింది. కార్యక్రమంలో పారాలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా (పీసీఐ) సెక్రటరీ జయవంత్ గుండు, అర్జున అవార్డు గ్రహీత, పారా బ్యాడ్మింటన్ ప్లేయర్ తులసిమతి మురుగేసన్ తదితరులు పాల్గొన్నారు. ఈ చాంపియన్‌షిప్‌ను జరిపేందుకు తమిళనాడు స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ అథారిటీ ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా తమిళనాడు పారా స్పోర్ట్స్ అసోసియేషన్‌తో చేతులు కలిపింది.