03-03-2025 12:40:23 PM
జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా ఎస్పీ జానకి
మహబూబ్ నగర్ (విజయక్రాంతి): వివాదాలు ఒకసారి ప్రారంభమైతే, జీవితాంతం కొనసాగుతూనే ఉంటాయని లో ఉన్న కేసులను పరిష్కరించుకొని జీవితాంతం సుఖసంతోషాలతో జీవించాలని జిల్లా ఎస్పీ డి జానికి(Mahabubnagar SP Janaki ) అన్నారు. ఉన్న కేసులను త్వరగా పరిష్కరించుకోవాలని నిర్ణయించుకుంటే, శాంతి సాధ్యమవుతుందన్నారు. రాజీమార్గమే రాజమార్గం అనే సూత్రాన్ని అనుసరించి, వివాదాలను చక్కదిద్దుకోవడానికి జాతీయ లోక్ అదాలత్ అద్భుతమైన అవకాశం అని జిల్లా ఎస్పీ తెలియజేశారు. జిల్లాలో వివిధ రకాల రాజీపడదగిన కేసుల్లో ఉన్న కక్షిదారులకు విజ్ఞప్తి చేస్తూ, ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ఉచిత న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో, మార్చి 8వ తేదీ వరకు మహబూబ్ నగర్, జడ్చర్ల కోర్టులలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించబడుతుందని పేర్కొన్నారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని, తమ కేసులను రాజీ చేసుకోవచ్చని తెలిపారు.
ఎలాంటి కేసులు రాజీ పడవచ్చు?
జాతీయ లోక్ అదాలత్ ద్వారా తక్షణమే పరిష్కరించుకునే కేసులు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. యాక్సిడెంట్ కేసులు, చీటింగ్ (మోసం) కేసులు, కొట్టుకున్న కేసులు, వివాహ బంధానికి సంబంధించిన కేసులు, చిన్న చిన్న దొంగతనం కేసులు, కరోనా సమయంలో నమోదైన కేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్ (మద్యం మత్తులో వాహనం నడిపిన కేసులు) లతో పాటు తదితర కేసులను పరిష్కరించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
కోర్టుకు ఎలా హాజరు కావాలి....
- మీకు తెలిసిన వ్యక్తులపై ఏమైనా కేసులు ఉంటే, వీటిని జాతీయ లోక్ అదాలత్ లో రాజీ చేసుకోవడానికి ఫిర్యాదు దారుడు మరియు నిందితుడు ఇద్దరూ కోర్టుకు హాజరుకావాలి.
-తమ ఆధార్ కార్డు తీసుకుని, సంబంధిత కోర్ట్ లేదా నిర్ణీత ప్రదేశంలో హాజరు కావాలి.
-కోర్టులో హాజరైన వెంటనే, రాజీ ప్రక్రియను పూర్తి చేసి, కేసును పూర్తిగా ముగించుకునే అవకాశం ఉంటుంది.
-జాతీయ లోక్ అదాలత్ ద్వారా లాభం..
కేసుల తక్షణ పరిష్కారం సంవత్సరాల తరబడి సాగే న్యాయపరమైన చికాకుల నుంచి విముక్తి
సంఖ్యాబద్ధ (ఫార్మల్) కోర్టు ప్రక్రియ అవసరం లేదు
1. లీగల్ ఫీజు, కోర్టు ఖర్చుల తగ్గింపు
2. సులభమైన, తక్కువ ఖర్చుతో కూడిన శాంతి సాధన మార్గం
3. ప్రతిరోజూ కోర్టుకు తిరగాల్సిన అవసరం లేకుండా సమస్యను ఒకే రోజు పరిష్కరించుకునే అవకాశమని కేసులలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని శాంతి, న్యాయం పొందాలని సూచించారు.