04-03-2025 12:00:00 AM
నిర్మల్, మార్చి 3 (విజయక్రాంతి) ః ఈనెల 8న జాతీయ లోకాదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని దీని సద్విని చూసుకోవాలని ఎస్పీ జానకీ షర్మిల తెలిపారు. నిర్మల్ భైంసా ఖానాపూర్ కోర్టు పరిధిలో ఉన్న కేసులను ఇరువర్గాల మధ్య రాజీ కుదిరితే లోక్అదాలత్ న్యాయమూర్తి సమక్షంలో కేసులు కొట్టివేయబడుతుందని దీన్ని చేసుకోవాలని ఎస్పీ వెల్లడించారు. ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న చిన్న చిన్న కేసులను లోక్అదాలత్తో పరిష్కారం చూపడం జరుగుతుందని వెల్లడించారు.