13-02-2025 12:00:00 AM
కోదాడ, ఫిబ్రవరి 12 ః దేశవ్యాప్తంగా ఇంజినీరింగ్ ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తమ కళాశాల విద్యార్థులు జాతీయస్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధించి నట్టు కోదాడ రేస్ ఐఐటి అకాడమీ చైర్మన్ బాణాల వసంత వెంకటరెడ్డి తెలిపారు.
బుధవారం కళాశాలలో అత్యధిక పర్సంటైల్ సాధించిన విద్యార్థులు ఎస్.దీక్షిత 98.79, సూర్యప్రకాష్ 98.43, ఎస్డి. హుజాఫా 98.34, పి.రోహిత్ రెడ్డి 98.02, సిహెచ్.కేఎస్ స్వరూప్రెడ్డి 96.14, కే.మణికంఠ 96.12, పి.వంశీ 96.11 పర్సంటైల్ సాధించిన విద్యార్థులను తల్లిదండ్రులు, అధ్యాపకులతో కలిసి అభినందించి విలేకరుల సమావేశంలో మాట్లాడారు
స్వర్గీయ బాణాల వెంకట్ రెడ్డి ఆశయాల సాధన మేరకు ప్రతిభ కలిగిన పేద విద్యార్థులు విద్యకు దూరం కాకుండా ఉండాలని పేద,మధ్యతరగతి విద్యార్థులకు అందుబాటు ఫీజులతో కోదాడలోనే రేస్ కళాశాల స్థాపించి కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ కృష్ణారావు, త్రివేణి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సిరికొండ శ్రీనివాస రావు విద్యార్థుల తల్లిదండ్రులు అధ్యాపకులు పాల్గొన్నారు.