ఇండియన్ స్టూడెంట్స్ యూనియన్
హైదరాబాద్, అక్టోబర్ 3 (విజయక్రాంతి): రాష్ట్రంలో మరిన్ని జాతీయ విద్యాసంస్థలను ఏర్పాటు చేయాలని ఇండియన్ స్టూడెంట్స్ యూనియన్ డిమాండ్ చేసింది. ఐఐఎం, ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ, కేంద్రీయ విశ్వవిద్యాలయాలతోపాటు ఇతర జాతీయ స్థాయి విద్యాసంస్థలను తీసుకొచ్చేలా కృషి చేయాలని బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు వద్ది రాజు రవిచంద్ర, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులు డాక్టర్ మల్లు రవికి గురువారం కలిసి యూనియన్ నేతలు పీ నాగరాజు, పీ వెంకటేశ్ గౌడ్ వినతిపత్రం అందజేశారు.