26-03-2025 05:14:44 PM
బాన్సువాడ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని నసురుల్లాబాద్ సేవాలాల్ బాలాధారణ స్వాములు మహా పాదయాత్ర బుధవారం దీక్ష గురువు టోప్యా నాయక్ మహారాజ్ ఆధ్వర్యంలో మహా పాదయాత్రగా పిట్లం మండలం, నసురుల్లాబాద్ మండలం నుంచి 18 మంది సేవాలాల్ మహారాజ్ మాలా ధరించుకొని మహారాష్ట్రలోని పౌర దేవి (బంజారా కాశి) కి దాదాపుగా 300 కిలోమీటర్ల పైగా వారం రోజులు పాటు నడుచుకుంటూ ఏప్రిల్ ఆరవ తేదీ నాడు శ్రీరామనవమి సందర్భంగా మాల విధారణ కార్యక్రమానికి మహా పాదయాత్రగా సునీల్ రాథోడ్ ఆధ్వర్యంలో వెళ్తున్నారు.