జానీ మాస్టర్ను కస్టడీకి ఇవ్వాలంటూ నార్సింగి పోలీసులుపిటిషన్
హైదరాబాద్: లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ కస్టడీ పిటిషన్ విచారణ రేపటికి వాయిదా పడింది. జానీ మాస్టర్ ను 5 రోజుల కస్టడీకి ఇవ్వాలంటూ నార్సింగి పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. జానీ మాస్టర్ను విచారించి మరిన్ని వివరాలు తెలుసుకోవాల్సిఉందని పోలీసులు తెలిపారు. మైనర్గా ఉన్న సమయంలోనే లేడీ కొరియోగ్రాఫర్పై జానీ మాస్టర్ అత్యాచారం చేసినట్టు ఆరోపణ వచ్చిన విషయం తెలిసిందే. పోక్సో కేసు కావడంతో రంగారెడ్డి జిల్లా కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు అయింది. విచారణ చేపట్టిన రంగారెడ్డి కోర్టు తదుపరి విచారణ వాయిదా వేసింది. అటు బెయిల్ మంజూరు చేయాలని జానీ మాస్టర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్ పై వాదనలు కోర్టు ఎల్లుండికి వాయిదా వేసింది.