calender_icon.png 23 September, 2024 | 3:52 PM

నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఇంటిపై దాడి

23-09-2024 01:15:18 PM

శివంపేట మండలం గోమారం గ్రామంలో ఎమ్మెల్యే ఇంటిపై దాడి చేసిన కాంగ్రెస్ నాయకులు

మెదక్,(విజయక్రాంతి): మెదక్ జిల్లా శివంపేట మండలం గోమారం గ్రామంలో కాంగ్రెస్ నాయకులు ఘర్షణకు పాల్పడ్డారు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత రెడ్డి స్వగ్రామమైన గోమారంలో కొందరు కాంగ్రెస్ నాయకులు నిమజ్జనం పేరిట  ఉద్దేశపూర్వకంగానే ఎమ్మెల్యే ఇంటిముందు భారీ ఎత్తున టపాసులు కాల్చడంతో ఎమ్మెల్యే ఇంట్లో ఉన్న కారుపై నిప్పురవ్వలు పడుతున్నాయని ఆ ఇంట్లో ఉన్న వ్యక్తి నీళ్లు చల్లడంతో కాంగ్రెస్ నాయకులు ఒక్కసారిగా అతనిపై దాడికి పాల్పడ్డారు. సదరు వ్యక్తి తలకు గాయాలయ్యాయి.

ఈ విషయం తెలుసుకున్న టిఆర్ఎస్ కార్యకర్తలు అక్కడికి చేరుకోవడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాటలు జరిగాయి. దీంతో గ్రామంలో ఉధృత పరిస్థితి నెలకొంది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సునీత రెడ్డి హుటాహుటిన గ్రామానికి చేరుకొని కార్యకర్తలతో సమావేశమయ్యారు. గ్రామానికి పోలీసులు చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. గోమారంలో జరిగిన ఘటనపై బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే సునీత రెడ్డి ఇంటికి చేరుకున్నారు. సోమవారం మధ్యాహ్నం మాజీ మంత్రి హరీష్ రావు గోమారం బి ఆర్ ఎస్ నేతలు తెలిపారు.