calender_icon.png 8 October, 2024 | 7:46 PM

వేములవాడ రాజన్నను దర్శించుకున్న అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి

08-10-2024 12:28:05 PM

కరీంనగర్, (విజయక్రాంతి): వేములవాడ రాజరాజేశ్వర స్వామిని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి మంగళవారం దర్శించుకున్నారు. అనంతరం రాజరాజేశ్వర స్వామి వారికి కోడె మొక్కు చెల్లించుకున్నారు. ఆలయ కల్యాణ మండపంలో అర్చకులు ఆశీర్వచనం, రాజన్న ప్రసాదాన్ని అందజేశారు. వేములవాడకు విచ్చేసిన నరేందర్ రెడ్డికి ఆలయ ఉద్యోగులు, అర్చకులు స్థానిక యువకులు శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం డా. బీఆర్ అంబేద్కర్ ,తెలంగాణ తల్లికి నివాళులు అర్పించి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.