calender_icon.png 10 October, 2024 | 5:46 PM

మంత్రి కొండా సురేఖకు కోర్టు నోటీసులు

10-10-2024 03:10:47 PM

హైదరాబాద్: నాంపల్లి ప్రత్యేక కోర్టులో నాగార్జున పిటిషన్ పై గురువారం విచారణ జరిగింది. మంత్రి కొండా సురేఖకు నాంపల్లి ప్రత్యేక కోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ ఈ నెల 23 వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గాంధీ జయంతి రోజున మంత్రి కొండా సురేఖ మాజీ మంత్రి కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ నాగార్జున కుటుంబ సభ్యులపై సంచలన ఆరోపణలు చేశారు. కేటీఆర్ వల్లే సమంత, నాగచైతన్య విడిపోయారని చెప్పారు. ఆమె చేసిన వ్యాఖ్యలు అటు రాజకీయ, సినీ పరిశ్రమలో సంచలనంగా మారాయి.