హైదరాబాద్: హీరో నాగార్జున వేసిన పిటిషన్ పై నాంపల్లి మనోరంజన్ కోర్టులో విచారణ జరిగింది. నాంపల్లి ప్రత్యేక కోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది. తన కుంటుంబంపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై నాగార్జున పిటిషన్ వేశారు. రేపు పిటిషనర్ నాగార్జున వాంగ్మూలం నమోదు చేయాలని కోర్డు ఆదేశించింది. నాగార్జునతో పాటు సాక్షుల వాంగ్మూలాలను రేపు నమోదు చేయాలని నాగార్జున తరుపున న్యాయవాది అశోక్ రెడ్డి కోరారు. నాగార్జున మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ పరువు నష్టం దావా వేశారు.